Mane Praveen

Apr 13 2024, 17:28

నాంపల్లి మండల ప్రెస్ క్లబ్ ఆరవ వార్షికోత్సవ డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నాంపల్లి మండల ప్రెస్ క్లబ్ ఆరవ వార్షికోత్సవ డైరీ ఆవిష్కరణ శనివారం జరిగింది. హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో వారి చేతుల మీదుగా డైరీ ఆవిష్కరణ జరిగింది.

ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్, నాంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదం, ఆధ్వర్యంలో టి యు డబ్ల్యూ జే -143 నాంపల్లి మండల శాఖ ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు, నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, నాంపల్లి జెడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర రెడ్డి, శీలం జగన్మోహన్ రెడ్డి, ఎరెడ్ల నారాయణరెడ్డి పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

Download Streetbuzz news app

Mane Praveen

Apr 12 2024, 21:39

మర్రిగూడెం మండలంలో కురిసిన చిరుజల్లులు...

నల్గొండ జిల్లా:

మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో సాయంత్రం ఐదు గంటల సమయంలో చిరుజల్లులు కురిసాయి. వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపిన ప్రకారం ఇవాళ వర్షం కురిసింది. ఉదయం అంతా ఓ మోస్తారు గా ఎండగా ఉన్న వాతావరణం సాయంత్రం సమయానికి ఒక్కసారిగా చల్లబడి, చిరుజల్లులు కురవడం మొదలయ్యింది. దీంతో వేసవి వేడి నుండి కాస్త ఉపశమనం కలిగినట్లు అయ్యింది.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 12 2024, 21:06

కళారంగంలో సేవలందించినందుకు రామ్‌చరణ్‌ కు డాక్టరేట్

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 13న జరగనున్న చెన్నైకి చెందిన వేల్స్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకల్లో రామ్ చరణ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ డాక్టరేట్‌ను అందుకోనున్నారు. 

కళారంగంలో రామ్‌చరణ్ అందించిన సేవలకుగానూ డాక్టరేట్‌ అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక రామ్‌చరణ్‌కు ఈ అరుదైన గౌరవం దక్కడంపై మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

Mane Praveen

Apr 12 2024, 19:27

NLG: డా.బిఆర్ అంబెడ్కర్, కామ్రేడ్ జార్జి రెడ్డి ఆశయాల సాదన కై ఏప్రిల్ 14 న మార్నింగ్ వాక్

నల్లగొండ: భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డా. బిఆర్ అంబెడ్కర్ 143 వ జయంతి మరియు విప్లవ విద్యార్థి నాయకుడు, PDSU వ్యవస్థాపకుడు ఇండియన్ చేగువేరా, ఉస్మానియా అరుణతార జార్జిరెడ్డి 52 వ వర్ధంతి సందర్భంగా వారి ఆశయాల సాధనకై ఏప్రిల్ 14 న ఉదయం 6 గంటలకు ఎన్. జి కాలేజ్ నుండి గడియారం సెంటర్ వరకు మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. ఈ కార్యక్రమంలో అంబెడ్కర్, జార్జిరెడ్డి అభిమానులు, PDSU పూర్వ విద్యార్థులు, ప్రగతిశీల మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని PDSU జిల్లా పూర్వ అధ్యక్షుడు పన్నాల గోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు.

పన్నాల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో అస్పృశ్యత, అంటరానితనం, దోపిడీ, పీడన, అసమానతలను రూపుమాపేందుకు డా.బిఆర్ అంబెడ్కర్, కా.జార్జిరెడ్డి లు ఎంతో కృషి చేశారని అన్నారు. 

పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, అనేక అవమానాలను, అణిచివేత లను ధిక్కరించి భారత జాతికి గొప్ప రాజ్యాంగాన్ని డా.బిఆర్ అంబెడ్కర్ అందించాడని అన్నారు. 

కా. జార్జిరెడ్డి సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా విద్యార్థులను చైతన్యం చేసినాడని, యూనివర్సిటీ లో మతోన్మాద శక్తుల ఆగడాలకు అడ్డుకట్టవేశాడని పేర్కొన్నారు. ఇద్దరి మేధావుల జయంతి, వర్ధంతిలు ఒకేరోజు రావడం కాకతాలియం అయినప్పటికీ వారి ఇద్దరి లక్ష్యం ఒక్కటేనని దేశంలో కులం, మతం లేని సమ సమాజాన్ని ఆవిష్కరించాలని కలలు కన్నారని వారి ఆశయాల అమలు కై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. 

అందులో భాగంగానే ఏప్రిల్ 14న డా,,బి.ఆర్ అంబెడ్కర్, కా,,జార్జిరెడ్డి ల స్పూర్తితో నల్లగొండలోని ఎన్.జి కాలేజ్ నుండి గడియారం సెంటర్ వరకు జరిగే మార్నింగ్ వాక్ లో ప్రగతిశీల మేధావులు, అభిమానులు, PDSU మాజీ,తాజా విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

       

Mane Praveen

Apr 12 2024, 11:54

NLG: సిపిఎం అభ్యర్థిని పార్లమెంటుకు పంపించాలి: ఎన్నికల ప్రచారం లో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య

మర్రిగూడెం మండలం, ఇందుర్తి గ్రామంలో, ప్రజా ఉద్యమ నాయకుడు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి ఎం.డి జహంగీర్ ను గెలిపించాలని, సిపిఎం పార్టీ మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య అన్నారు. ఉపాధి హామీ పని ప్రదేశంలో కూలీలను కలిసి సిపిఎం అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. ప్రజా పోరాటాలలో ముందున్న సిపిఎం అభ్యర్థిని పార్లమెంటుకు పంపించాలని ఓటర్లను కోరారు.

ఈ దేశాన్ని 10 సంవత్సరాలుగా ఏలుతున్న బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందని, ఈ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ ప్రవేట్ పరం చేస్తూ నిరుద్యోగం ఎన్నడూ లేనంతగా పెంచి పోషించిందని, ప్రజలపై పెనుభారం మోపుతుందని ఆరోపించారు. ఈ బిజెపి ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఓడించాలని, అట్లాగే ప్రతినిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రజా నాయకుడు ఎర్రజెండా ను భుజాన ఎత్తుకున్న భువనగిరి ఎంపీ అభ్యర్థి జహంగీర్ ను ఢిల్లీ పార్లమెంట్ కు పంపాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో పగిళ్ల రామచంద్రం, అయితగోని నరసింహ గౌడ్, అనంతల నరసింహ గౌడ్, శ్రీరామదాసు సుదర్శనమ్మ, చెరుకు గౌరమ్మ, పగిళ్ల కవిత, ఊరి పక్క ఇందిరమ్మ, ఊరి పక్క రాములమ్మ, బోడ సత్తెమ్మ, శ్రీరామదాసు సత్యనారాయణ చారి, అయితగోని సత్తమ్మ, పగిళ్ల మట్టమ్మ, వీరమల్ల నరసమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Apr 11 2024, 20:59

NLG: కార్యకర్త కుటుంబానికి అండగా మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ మండలం, నర్సింగ్ భట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అమరోజు స్వామి బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వారి కుటుంబానికి ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయం చేసి, అండగా ఉంటానని, వారి కుమారుడు కూతురు చదువుకోవడానికి పూర్తిగా సహకారం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఏదైనా అవసరం ఉంటే స్థానిక ఎంపిటిసి జాకీరా-తాజుద్దీన్ అందుబాటులో ఉంటారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కాసాని లింగస్వామి గౌడ్, బొమ్మగోని సత్యనారాయణ, బొమ్మగోని సైదులుగౌడ్, తిరుమల రాము, పుట్ట రాకేష్, బల్లెం ప్రవీణ్ కుమార్, సూరారపు నగేష్, రాపోలు రమేష్, వల్లకీర్తి సత్తయ్య, మర్రి సతీష్, మర్రి ఏడుకొండలు యాదవ్, కంభం మహేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 11 2024, 17:38

NLG: దామర భీమన పల్లి లో ఘనంగా పూలే 197వ జయంతి

నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం:

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక విప్లవానికి పునాదులు వేసినా ఉద్యమకారుడు, మహిళలకు విద్యావకాశం కల్పించిన గొప్ప సంఘసంస్కర్త, మహాత్మ జ్యోతి రావు పూలే 197 వ జయంతి సందర్బంగా, దామెర భీమనపల్లి గ్రామములో మహనీయుడి సేవలను స్మరించుకుంటూ పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు కర్నాటి సత్తయ్య గౌడ్, కొండూరు శేఖర్ గుప్తా, కర్నాటి కృష్ణయ్య గౌడ్, గ్రామ యువకులు అంబళ్ల రవి గౌడ్, మెట్టు శ్రీకాంత్, షేక్ సలీం, బెల్లంకొండ నాగరాజు గ్రామ ప్రజలు కాశిం బి, మోహన్ రెడ్డి, శ్రీను, లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS

SB NEWS NALGONDA DIST

Mane Praveen

Apr 11 2024, 14:14

NLG: చండూర్ లో ఘనంగా జ్యోతిబాపూలే జయంతి

చండూరు: బహుజన్ సమాజ్ పార్టీ మునుగోడు నియోజకవర్గం కార్యాలయం చండూరు నందు, మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మునుగోడు నియోజకవర్గ బీఎస్పీ ఇన్చార్జి నేరెళ్ల ప్రభుదాస్, బహుజన్ సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు పూదరి నరసింహ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త, నవయుగ వైతాళికుడు, మనుషుల్ని మహాత్ముని గా తీర్చిదిద్దేది విద్య ఒక్కటేనని, మనిషిని మహోన్నతమైన ఉన్నత స్థాయికి విద్యనే తీసుకొని వెళుతుందని భావించి, మహిళలకు సైతం విద్యను నేర్పించి తన భార్యను ఉపాధ్యాయురాలుగా చేసి మొట్టమొదటి పంతులమ్మ గా తీర్చిదిద్దిన వ్యక్తి మహాత్మ జ్యోతిబా పూలే అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అధ్యక్షుడు పల్లేటి వినోద్ కుమార్, అసెంబ్లీ కార్యదర్శి అన్నిపాక శంకర్, చండూర్ మున్సిపల్ అధ్యక్షులు కడారి సైదులు యాదవ్, చండూర్ బహుజన్ సమాజ్ పార్టీ ఉపాధ్యక్షులు చాపల నాగరాజ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Apr 11 2024, 14:01

NLG: వివక్ష లేని సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త జ్యోతి బా పూలే

నకిరేకల్: మహాత్మా జ్యోతి రావ్ పూలే జయంతి సందర్భంగా, శాసనసభ్యులు వేముల వీరేశం, పట్టణంలోని పన్నాల గూడెం క్యాంపు కార్యాలయం నందు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...

సామాజిక కార్యకర్తగా, సంఘ సంస్కర్తగా, వర్ణ వివక్షకు వ్యతిరేక పోరాటానికి బాటలు వేసిన క్రాంతి కారుడు పూలే అని మహాత్మ పూలే సేవలను స్మరించుకున్నారు.

వివక్ష లేని సమానత్వ సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త జ్యోతి బా పూలే అని కొనియాడారు.

సామాజిక కార్యకర్తగా, సంఘ సంస్కర్తగా, వర్ణ వివక్ష వ్యతిరేక పోరాటానికి బాటలు వేసిన దార్శనికుడు మహాత్మా జ్యోతి రావ్ గోవింద్ రావ్ పూలే.. దళిత, బహుజన జనోద్ధరణ కోసం జీవితకాలం పూలే చేసిన కృషి భారత సమాజంలో విప్లవాత్మక మార్పులకు బాటలు వేసిందన్నారు.

తన భార్య సావిత్రి బాయి పూలే కు విద్యాబుద్దులు నేర్పి, దేశంలో ప్రథమ ఉపాధ్యాయురాలిని చేసి స్త్రీ విద్యకు బాటలు వేసిన ఘనత పూలేకు దక్కుతుందన్నారు. పూలే ఆశయ సాధన దిశగా నిరంతరం కృషి చేయాలని పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో నకిరేకల్ మండల PACS చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, స్థానిక కౌన్సిలర్లు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు..

Mane Praveen

Apr 10 2024, 23:04

ఇఫ్తార్ విందులో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్

నాంపల్లి: మండల కేంద్రంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్, బుధవారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. 


ఈ కార్యక్రమంలో కోట రఘునందన్, తిప్పని వెంకట్ రెడ్డి, అలంపల్లి ఆనంద్ కుమార్, పోలోజు వెంకటాచారి, శర్ఫోద్దీన్, కైరత్ జాను, దస్తగిరి, ముస్లిం పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS

SB NEWS NLG